విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు – ఎస్సీ మోర్చా కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌న

విశాఖపట్నంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారిని బీజేపీ ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానతల సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు Santhosh BL BJP సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను శ్రీ నితిన్ నబిన్ గారు మరియు జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ సంతోష్ బి.ఎల్. జీ పరిశీలించారు.

ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను నాయకులు అభినందించడం కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. ప్రజా సేవ, సామాజిక సమరసత, చైతన్య కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఇది ప్రేరణగా నిలిచింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *